జస్టిస్ దీపక్వర్మ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ఇటీవలి ఏజీఎమ్లో జస్టిస్ దీపక్వర్మను అంబుడ్స్మన్గా నియమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తన నియామకంపై జస్టిస్ వర్మ సోమవారం చేసిన రెండు ప్రకటనలు గందరగోళానికి దారి తీశాయి. తొలుత అజారుద్దీన్తో పాటు కార్యదర్శి విజయానంద్ న్యాయ సలహాదారు అద్నాన్ మహమూద్కు జస్టిస్ వర్మ మెయిల్ పంపారు. ఇందులో విజయానంద్ నుంచి తనకు వచ్చిన మెయిల్పై జస్టిస్ వర్మ స్పందిస్తూ ‘అంబుడ్స్మన్, ఎథిక్స్ అఫీసర్లుగా ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులను నియమించినట్లు తెలిసింది. హెచ్సీఏలో ప్రస్తుతం నెలకొన్న వివాదంలో నేను తలదూర్చలేను. నా సమస్యను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’ అని మెయిల్ చేశారు. అయితే సాయంత్రమయ్యే సరికి జస్టిస్ వర్మ తిరిగి తన మెయిల్పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘నేను ఇప్పటికీ హెచ్సీఏ అంబుడ్స్మన్గా ఉన్నాను. ఇరు వర్గాల మధ్య సమస్య ఉంటే నన్ను సంప్రదించే ప్రయత్నం చేయవద్దు. ఏదైనా ఉంటే కోర్టు దృష్టికి తీసుకెళ్లండి. హైకోర్టు తీర్పుతో పాటు హెచ్సీఏ చీఫ్ నిర్ణయంతో అంబుడ్స్మన్గా నా గడువు ముగిసే వరకు కొనసాగుతాను’ అని వివరణ ఇచ్చారు.