Deepa Karmakar : భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్(Deepa Karmakar) మళ్లీ జాతీయ స్ఠాయిలో ఆడనుంది. ప్రతిష్ఠాత్మక సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ చాంపియన్షిప్స్(Senior National Championship)లో ఆమె పోటీ పడనుంది. ఎనిమిదేండ్ల తర్వాత దీప ఈ పోటీల్లో పాల్గొంటుండడం విశేషం. అయితే. ఇదే ఆమెకు చివరి సీనియర్ నేషనల్స్ అని ఆమె కోచ్ కోచ్ బిశ్వేశ్వర్ నంది(Bisweshwar Nandi) చెప్తున్నాడు.
‘దీప సీనియర్ నేషనల్స్లో ఆడనుంది. ఆమె చివరిసారిగా 2015లో జాతీయ స్థాయిలో పోటీపడింది. ఈసారి జరిగే పోటీలు దీపకు చివరివి కానున్నాయి. ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న దీప టోర్నీ సమయానికి కల్లా ఫిట్నెస్ సాధిస్తుంది’ అని బిశ్వేశ్వర్ వెల్లడించాడు. ఒలింపిక్స్లో పాల్లొన్న భారత తొలి మహిళా జిమ్నాస్ట్గా చరిత్ర సృష్టించిన దీప.. ఆ తర్వాత డోప్ పరీక్షలో పట్టుబడిన విషయం తెలిసిందే.
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జనవరి 2వ తేదీ నుంచి టోర్నీ మొదలవ్వనుంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్లో పతకం గెలిచిన ప్రణతి నాయక్తో పాటు యోగేశ్వర్ సింగ్, రాకేశ్ పత్రా, తపన్ హొహంతి, సైఫ్ తంబోలి, గౌరవ్ కుమార్ తదితరులు పోటీ పడనున్నారు. ఈ టోర్నీలో దేశనలుమూలల నుంచి 550 మంది అథ్లెట్లు, వాళ్లకు సహాయకంగా 120 మంది కోచ్లు, 100 మంది అధికారులు కలిపి 750 మంది పాల్గొననున్నారు.