ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ ఓపెనర్లు అదరగొట్టారు. ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేశారు. గత మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ను టార్గెట్ చేసి జోస్ బట్లర్ (99 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (54) దంచికొట్టారు. దీంతో పదిహేను ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 155 పరుగులు చేసింది.
అయితే ఆ తర్వాతి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్కు వచ్చి.. ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. 16వ ఓవర్ తొలి బంతికే హాఫ్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ను పెవిలియన్ చేర్చాడు. ఖలీల్ వేసిన బంతిని ఫ్లిక్ చేయడానికి పడిక్కల్ ప్రయత్నించాడు. కానీ మిస్ అవడంతో బంతి ప్యాడ్లను తాకింది. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో పంత్ రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలడంతో పడిక్కల్ మైదానం వీడాడు.