పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా (41)ను రాహుల్ చాహర్ అవుట్ చేశాడు. షాతోపాటు వార్నర్ (37 నాటౌట్) కూడా అద్భుతంగా ఆడుతుండటంతో వీళ్లిద్దరే ఛేజింగ్ ముగిస్తారని అభిమానులు అనుకున్నారు. అయితే రాహుల్ చాహర్ ఆ ఆశలను చెరిపేశాడు.
ఏడో ఓవర్లో చాహర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు షా ప్రయత్నించాడు. అయితే అది సరిగా కనెక్ట్ అవకపోవడంతో డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ ఎలిస్కు క్యాచ్ వెళ్లింది. అతను అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకొని క్యాచ్ అందుకోవడంతో షా పెవిలియన్ చేరాడు. 84 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.