లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తిన్న ఢిల్లీని మిచెల్ మార్ష్ (37)తో కలిసి విజయం దిశగా నడిపిన కెప్టెన్ రిషభ్ పంత్ (44) కూడా పెవిలియన్ చేరాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొహ్సిన్ వేసిన ఫుల్లెంగ్త్ డెలివరీని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించిన పంత్.. మిస్ అయ్యాడు.
ఆ బంతి నేరుగా వెళ్లి వికెట్లను కూల్చింది. దీంతో ఢిల్లీ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. పదమూడో ఓవర్ పూర్తయ్యే సరికి 120 పరుగులతో ఉన్న ఢిల్లీ.. గెలవాలంటే మరో 76 పరుగులు అవసరం ఉన్నాయి. క్రీజులో ఉన్న పావెల్, అక్షర్ పటేల్ బ్యాటు ఝుళిపిస్తే ఢిల్లీ గెలిచే అవకాశాలు ఉన్నాయి.