ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో బ్యాటింగ్ రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (77).. జట్టుకు శుభారంభం ఇచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. అతనికి క్వింటన్ డీకాక్ (23) మంచి సహకారం అందించాడు.
డీకాక్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా (52) కూడా రాణించడంతో లక్నో జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే ఆ జట్టును మరోసారి శార్దూల్ ఠాకూర్ దెబ్బతీశాడు. హుడాను పెవిలియన్ చేర్చాడు. మార్కస్ స్టొయినిస్ (10 నాటౌట్)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్న రాహుల్ను కూడా 19వ ఓవర్లో శార్దూల్ అవుట్ చేశాడు.
చివర్లో కృనాల్ పాండ్యా, స్టొయినిస్ భారీ షాట్లు ఆడలేకపోవడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగుల స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే మూడు వికెట్లు తీసుకోవడం గమనార్హం.