న్యూఢిల్లీ: ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) .. ఐపీఎల్లో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఆ టోర్నీలో 600 ఫోర్లు(fours) దాటిన రెండవ ప్లేయర్గా నిలిచాడు. మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో వార్నర్ 51 రన్స్ చేశాడు. దాంట్లో ఆరు బౌండరీలు ఉన్నాయి. అయితే ఐపీఎల్లో 600 ఫోర్ల మార్క్ను దాటిన రెండవ క్రికెటర్గా నిలిచాడు. మొదటి స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. 209 మ్యాచ్లు ఆడిన ధావన్.. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు 728 ఫోర్లు కొట్టాడు.ఇక మూడవ స్థానంలో ఉన్న కోహ్లీ ఖాతాలో 591 ఫోర్లు ఉన్నాయి. అయిదో స్థానంలో రోహిత్ శర్మ(528), ఆరో స్థానంలో సురేశ్ రైనా(506) ఉన్నారు.