David Warner: తన కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఆసీస్ క్రికెట్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశాలున్నాయి. మరి టీ20 వరల్డ్ కప్ తర్వాత వార్నర్ ఏం చేస్తాడు..? మైదానంలోకి దిగితే అభిమానులను తన ఆటతో పాటు తనదైన హావభావాలు, డాన్సులతో అలరించే ఈ దిగ్గజ ఆటగాడు.. త్వరలోనే వ్యాఖ్యాతగా అవతారమెత్తనున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో అతడు కామెంటేటర్గా అతడు ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది.
భారత జట్టు 2024 నవంబర్ – డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటన వెళ్లనున్నది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో వార్నర్.. కామెంటేటర్గా కొత్త పాత్రలో కనిపించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు చెబుతున్నాయి. వార్నర్ కామెంట్రీ బాక్స్లోకి వస్తే అది అతడి ఫ్యాన్స్తో పాటు క్రికెట్ అభిమానులకు పండుగే అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
David Warner will be doing commentary in India vs Australia Test series in November 2024. pic.twitter.com/bCLdI2StXK
— Johns. (@CricCrazyJohns) January 4, 2024
ఇప్పటివరకూ 112 టెస్టులు ఆడిన వార్నర్.. 204 ఇన్నింగ్స్లో 8,729 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలున్నాయి. వార్నర్ శతకాలలో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్లో వార్నర్.. 34 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్నా వార్నర్.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు సారథిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్తో పాటు యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ (ఐఎల్ టీ20)లోనూ ఢిల్లీ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు.