David Warner: ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇదివరకే టెస్టులు, వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఆసీస్ ఓపెనర్.. తాజాగా టీ20లలో కూడా సొంతగడ్డలో ముగింపు పలికాడు. ఇకపై తాను సొంతగడ్డపై అంతర్జాతీయ స్థాయిలో టీ20లు ఆడబోనని, ఆస్ట్రేలియాలో ఇదే తనకు ఆఖరి మ్యాచ్ అని తేల్చేశాడు. విండీస్తో ఆఖరి టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత వార్నర్.. మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఏడాది అమెరికా/వెస్టిండీస్ వేదికగా జూన్లో జరుగబోయే టీ20 వరల్డ్ కప్లో ఆడి పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని డేవిడ్ వార్నర్ గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. అయితే సొంతగడ్డపై మాత్రం వార్నర్కు ఇదే ఆఖరి మ్యాచ్. ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్లో వార్నర్ ఆడినా అది కివీస్ గడ్డపైనే. ఆ తర్వాత అతడు ఐపీఎల్ ఆడేందుకు భారత్కు వస్తాడు. అదీ ముగిశాక నేరుగా అమెరికాకు పయనమవుతాడు.
విండీస్తో మ్యాచ్ ముగిశాక గిల్క్రిస్ట్, వార్నర్తో మాట్లాడుతూ.. ‘టీ20 వరల్డ్ కప్ తర్వాత నువ్వు స్వదేశంలో ఈ ఫార్మాట్లో మ్యాచ్లు ఆడతావా..?’ అని అడిగాడు. దానికి వార్నర్ స్పందిస్తూ… ‘లేదు. నేను ముగించాను. ఇది కొత్తవాళ్లకు అవకాశమివ్వాల్సిన సమయం. మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది. వారికి అవకాశమివ్వాలి..’ అని చెప్పాడు.
David Warner gifted his Player of the series award to a little fan after the match.
– What a beautiful gesture by Warner. pic.twitter.com/z0c2VBU2bs
— CricketMAN2 (@ImTanujSingh) February 13, 2024
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వార్నర్ తన సత్తా చాటాడు. తొలి మ్యాచ్లో 36 బంతుల్లోనే 70 పరుగులు చేసిన వార్నర్ భాయ్.. రెండో మ్యాచ్లో 19 బంతుల్లో 22 రన్స్ చేశాడు. ఇక నేడు ముగిసిన మూడో టీ20లో 49 బంతులలోనే 81 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్లలో కలిపి 173 పరుగులు చేసిన వార్నర్కే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. తొలి రెండు మ్యాచ్లు గెలిచిన ఆసీస్.. పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన మూడో టీ20లో 37 పరుగుల తేడాతో ఓడింది.