హైదరాబాద్, ఆట ప్రతినిధి: సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ అండర్-13 బాలబాలికల చెస్ చాంపియన్షిప్లో దర్శన్ ముందంజ వేశాడు. బుధవారం జరిగిన గేమ్లో తమిళనాడుకు చెందిన దర్శన్..రాఘవ్పై అద్భుత విజయం సాధించాడు. టోర్నీలో దర్శన్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా గేముల్లో వందన్, మానస్, వీరేశ్, మృణ్మయ్, సిద్దాంత్ విజయాలు సాధించారు.