Gukesh | టొరంటో: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. గురువారం జరిగిన పురుషుల ఆరో రౌండ్ పోరులో గుకేశ్..హికారు నకమురాతో గేమ్ను డ్రా చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఇయాన్ నెపోమియాచీ(4)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
మిగతా గేముల్లో విదిత్ గుజరాతి..ఫిరౌజ అలీరెజాపై గెలువగా, ప్రజ్ఞానంద..నిజాత్ అబసోవ్ను ఓడించిచాడు. మరోవైపు మహిళల కేటగిరీలో వైశాలి..క్యాతరీనా లాగ్నో చేతిలో ఓడగా, కొనేరు హంపిపై తింగ్జి లీ గెలిచి ముందంజ వేసింది.