చిన్నకోడూరు, డిసెంబర్ 23: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ రిజర్వాయర్ కట్టమీద రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి 33 జిల్లాలకు చెందిన 200 మంది సైక్లింగ్ క్రీడాకారులు పోటీపడుతున్నారు.
అండర్-14, 16, 18 విభాగాల్లో బాలబాలికలు సైక్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం ఫైనల్ పోటీ లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.