Common Wealth Gamens | కామన్వెల్త్ గేమ్స్-2022 టోర్నీలో బ్యాడ్మింటన్ సింగిల్స్లో గురువారం జరిగిన మ్యాచ్ల్లో భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ గెలుపొంది, ప్రీ-క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మాల్దీవులుకు చెందిన ఫాతిమాహ్ నబామా అబ్దుల్ రజాక్ను 21.-4, 21-11 తేడాతో ఓడించారు. మరో షట్లర్ కిదాబి శ్రీకాంత్.. మెన్స్ సింగిల్స్లో ఉగాండకు చెందిన డానియల్ వానగలియాను 21-9, 21-9 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ఎంటరయ్యారు.
ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన సింధూ.. తన మాల్దీవులు ప్రత్యర్థి ఫాతిమాహ్పై సునాయాస విజయం సాధించారు. సెకండ్ సెట్లో ఫాతిమా నుంచి కొంత ప్రతిఘటన ఏర్పడింది. ఒకానొక దశలో స్కోర్ 9-9గా కొనసాగింది. తర్వాత పుంజుకున్న పీవీ సింధు.. 21-11 స్కోర్ తేడాతో ఫాతిమాను మట్టి కరిపించారు.
మిక్స్డ్ టీం ఫైనల్స్లో మలేషియాకు చెందిన జేయంగ్ ఎన్పై సింగిల్స్ మ్యాచ్ ఓడిపోయిన కిడాంబి శ్రీకాంత్.. తన సింగిల్స్ విభాగంలో ఉగాండ ప్రత్యర్థిపై తేలిగ్గా విజయం సాధించారు. 21-9, 21-9 స్కోర్లలో కిడాంబి శ్రీకాంత్ పొరపాట్లను ఉగాండా డానియల్ వానగిలియా అనువుగా మార్చుకోవడం వల్ల వచ్చిన పాయింట్లే ఎక్కువ.