AUS vs WI : ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వెస్టిండీస్ (West Indies)తో జరుగుతున్న రెండో టెస్టులో ఆధిక్యానికి మరో 22 పరుగుల ముందే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. రెండో రోజు మూడో సెషన్లో.. 289 పరుగుల వద్ద నాథన్ లియాన్ 9వ వికెట్గా వెనుదిరిగాడు. దాంతో, ఆలౌట్ ప్రమాదం తప్పించుకోవడానికి అతడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే.. ఇంకా 14 ఓవర్ల ఆట ఉన్నందున విండీస్ను ఆడించి చకచకా రెండు మూడు వికెట్లు తీయాలని కమిన్స్ ఆలోచన.
తొలి టెస్టులో వెస్టీండీస్ను చిత్తుగా ఓడించిన కమిన్స్ సేన గబ్బాలోనూ విజయంపై కన్నేసింది. తొలత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టును తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ను ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(75), వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(65), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(64 నాటౌట్) హాఫ్ సెంచరీతో అదుకున్నారు.
Australia declare whilst trailing – West Indies in for tricky 20 minutes or so under lights!
▶️https://t.co/JaiUxIP29d | #AUSvWI pic.twitter.com/97DIPz6KeC
— ESPNcricinfo (@ESPNcricinfo) January 26, 2024
మిడిలార్డర్ విఫలమైనప్పటికీ క్యారీ, కమిన్స్ ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 250 దాటించారు. క్యారీ ఔటయ్యాక లియాన్(19)తో కలిసి కమిన్స్ జట్టు స్కోర్ను పరుగులు పెట్టించాడు. అయితే.. అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో లియన్.. జాషువా డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికీ ఆసీస్ స్కోర్.. 289/9. దాంతో, కమిన్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఆధిక్యానికి 22 పరుగుల దూరంలో అతడు ఇన్నింగ్స్ను ఆపేయడంతో విండీస్ జట్టు ఒకింత ఆశ్చర్యానికి గురైంది.