చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ బౌలింగ్ విభాగం సత్తా చాటింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నైను కట్టడి చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నై ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (15), రుతురాజ్ గైక్వాడ్ (16) ఇద్దరూ స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత మొయీన్ అలీ (48), అంబటి రాయుడు (27) ఫర్వాలేదనిపించారు. శివమ్ దూబే (3), ధోనీ (3) నిరాశపరచగా..
చివర్లో కెప్టెన్ రవీంద్ర జడేజా (23) మంచి షాట్లు ఆడాడు. అయితే అతన్ని భువనేశ్వర్ చివరి ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. డ్వేన్ బ్రావో (8 నాటౌట్), క్రిస్ జోర్డాన్ (6 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, మార్క్రమ్, మార్కో జాన్సెన్ తలో వికెట్ తీసుకున్నారు.
1️⃣5️⃣5️⃣ is the target for the #Risers. Over to the batsmen now to get us the two points! #CSKvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2022