పంజాబ్, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్ అభిమానులు అసలు సిసలు ఐపీఎల్ రుచి చూపుతోంది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్.. ఆ తర్వాత అనూహ్యంగా తేరుకుంది. మెగావేలంలో భారీ ధరకు పంజాబ్ కొనుగోలు చేసిన లియామ్ లివింగ్స్టోన్ (60) దొరికిన బంతిని దొరికినట్లే బాదేశాడు. దాంతో పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ పట్టాలెక్కింది.
అతనికి ధవన్ (33) అండగా నిలిచి మరో వికెట్ పడనీయలేదు. వీళ్లిద్దరూ కలిసి మూడో వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ తర్వాత చెన్నై బౌలర్లు అనూహ్యంగా పుంజుకొని వీళ్లిద్దరినీ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేర్చారు. మిగతా పంజాబ్ బ్యాటర్లలో జితేష్ శర్మ (26) మినహా షారుఖ్ ఖాన్ (6), ఒడియన్ స్మిత్ (3) నిరాశ పరిచారు. కగిసో రబాడ (12 నాటౌట్), రాహుల్ చాహర్ (12), వైభవ్ అరోరా (1 నాటౌట్) పరుగులు చేశారు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో జోర్డాన్, డ్వెయిన్ ప్రిటోరియస్ చెరో రెండు వికెట్లు తీయగా.. ముకేష్ చౌదరి, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
Switch it up! Turning a 180° to bat!🔥#CSKvPBKS #Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/JqqsfboAHi
— Chennai Super Kings (@ChennaiIPL) April 3, 2022