చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టు కూడా తడబడుతోంది. చెన్నై పేసర్ ముకేష్ చౌదరి అద్భుతంగా రాణించడంతో.. టాపార్డర్ కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (6), రోహిత్ శర్మ (18), డానియల్ శామ్స్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (0) స్వల్పస్కోర్లకే అవుటయ్యారు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి ముంబై జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు 97 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.