కోల్కతా చేతిలో చెన్నై ఓటమి
చెన్నై: సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్కు పరాజయం ఎదురైంది. ఈ సీజన్లో చెపాక్లో ఆడిన చివరి మ్యాచ్లో నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలనుకున్న ధోనీ సేనపై కోల్కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శివమ్ దూబే (48 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు), కాన్వే (30) రాణించారు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో కోల్కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా (57 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్), రింకూ సింగ్ (54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు పడగొట్టాడు. చెన్నై బౌలర్ల ధాటికి ఒక దశలో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కోల్కతా కష్టాల్లో పడ్డా.. రింకూ, రాణా ఆదుకున్నారు. రింకూకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 144/6 (దూబే 48*; కాన్వే 30; నరైన్ 2/15),
కోల్కతా: 18.3 ఓవర్లలో 147/4 (రాణా 57*, రింకూ 54).