చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్ మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (54 నాటౌట్) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. గిల్ (18) అవుటైన తర్వాత వచ్చిన మాథ్యూ వేడ్ (20) కూడా ధాటిగా ఆడటంతో గుజరాత్ మంచి స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా (7) విఫలమైనా.. విజయానికి చేరువలో నిలిచింది.
ప్రస్తుతం సాహాతోపాటు డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు 3 వికెట్ల నష్టానికి 117 పరుగులతో నిలిచింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకో 17 పరుగులు చేయాలి.