ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు మరో వికెట్ కోల్పోయింది. మంచి ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబే (32) అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికే అతను వెనుతిరిగాడు. మార్ష్ వేసిన బంతిని లాంగాఫ్ మీదుగా పంపేందుకు దూబే ప్రయత్నించాడు.
అయితే బ్యాటు అంచున తగిలిన బంతి.. లాంగాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్ వైపు వెళ్లింది. అతను ఎలాంటి పొరపాటూ లేకుండా క్యాచ్ అందుకోవడంతో దూబే మైదానం వీడాడు. అయితే దూబే అవుటైన తర్వాత ధోనీ మైదానంలోకి వస్తాడన్న ఆశతో చెన్నై అభిమానులు కూడా సంబరాలు చేసుకోవడం విశేషం.