IPL Mega Auction | ఆంధ్రాకు చెందిన క్రికెటర్ అంబటి రాయుడు తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) గూటికే చేరాడు. శనివారం తొలి రోజు జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో అంబటిరాయుడ్ని సీఎస్కే రూ.6.75 కోట్లకు దక్కించుకుంది. తొలుత అంబటి రాయుడు బేస్ ప్రైస్గా రూ.2 కోట్లు అని ప్రకటించారు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మన్గా గత కొన్ని సీజన్లలో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. ఐపీఎల్లో అత్యంత అనుభవం గల క్రికెటర్ కూడా.
2010 నుంచి ఐపీఎల్ టోర్నీలో పాల్గొంటున్నాడు. మొత్తం 175మ్యాచ్ల్లో 3,916 పరుగులు చేశాడు. ఒక సెంచరీ , 21 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. 2019లో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. కానీ తన ప్రకటన నుంచి యూ-టర్న్ తీసుకున్నాడు. సయ్యద్ ముస్తాఖ్ అలీ టోర్నీకి ఆంధ్రా జట్టు తరఫున సారధ్యం వహిస్తున్నాడు.