న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో అతడు అంతర్జాతీయ లీగ్ టోర్నీల్లో పాల్గొనేందుకు మార్గం సుగుమమైంది.
35 ఏండ్ల రైనా 2020 ఆగస్టు 15న ధోనీ కెరీర్కు వీడ్కోలు పలికిన రోజే.. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కడం గర్వంగా ఉందని, తన కెరీర్లో బాసటగా నిలిచిన బిసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘానికి, అభిమానులకు రైనా కృతజ్ఞతలు తెలిపాడు.