హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత మాజీ ఆల్రౌండర్, చీఫ్ కోచ్ రవిశాస్త్రికి బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారం లభించనుంది. ఆటగాడిగా, కోచ్గా జాతీయ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించినందుకు గానూ ఈ అవార్డు అందించనున్నారు.
మంగళవారం హైదరాబాద్ వేదికగా జరగనున్న అవార్డుల కార్యక్రమంలో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించనుంది. అవార్డుల కార్యక్రమానికి భారత్, ఇంగ్లండ్ జట్లు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి తెలిపారు.