హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రికెటర్ల కోసం మరో ఉపకరణాల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. అతిపెద్ద మల్టీబ్రాండెడ్ ఉపకరణాల కంపెనీగా పేరొందిన క్రిక్ఫ్యూజ్ హైదరాబాద్లో మూడో షోరూమ్ను నెలకొల్పింది. నగరంలో నూతన ఔట్లెట్ను బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ శనివారం ప్రారంభించాడు. ఈ సందర్భంగా సంస్థ తయారు చేసిన వాలెన్స బ్యాట్ను ఎమ్మెస్కే ఆవిష్కరించాడు. క్రికెటర్ల వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా సంస్థ ఉపకరణాలు తీసుకురావడం అభినందనీయమన్నారు. వర్ధమాన క్రికెటర్లకు ఇది ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో క్రిక్ఫ్యూజ్ ఫ్రాంచైజీస్ హెడ్ విన్నకోట అనంత, సీఈవో శైలేష్ నారాయణ్, నిషాంత్గుప్త పాల్గొన్నారు.