The Elephant Whispers | ఐపీఎల్-2023లో మహేంద్ర సింగ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేస్తున్నది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతున్నది. బుధవారం చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో సీఎస్కే మ్యాచ్ ఆడనున్నది. ఇటీవల ఆస్కార్ అవార్డు పొందిన డాక్యుమెంటరీ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’లో నటించిన బొమ్మన్, బెల్లి చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బొమ్మన్, బెయిలీలకు ధోనీ వారి పేర్లతో కూడిన ఏడో నంబర్ జెర్సీని గిఫ్ట్గా ఇచ్చాడు. ధోనీ ఆస్కార్ అవార్డుతో ఫొటోకు ఫోజులిచ్చాడు. మిస్టర్ కూల్ తనయ జీవా సైతం ఆస్కార్ విన్నింగ్ చిత్ర బృందంతో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్కే ‘ప్రత్యేక వ్యక్తులతో ప్రత్యేక్ష క్షణం’ అంటూ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది.
మా హృదయాలను గెలుచుకున్న చిత్రబృందానికి ప్రశంసలు! బొమ్మన్, బెల్లి, నిర్మాత కార్తికీ గోన్సాల్వేస్ను కలుసుకోవడం బాగుంది’ అని తెలిపింది. ది ఎలిఫెంట్ విస్పర్స్లో బొమ్మన్, బెల్లి ఏనుగుల సంరక్షకులుగా నటించారు. ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు. గునీత్ మోంగా, కార్తికీ గోన్సాల్వేస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ డాక్యుమెంటరీకి ప్రపంచవ్యాప్తంగా విమర్శల ప్రశంసలను అందుకొని.. ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్గా ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.