హైదరాబాద్, ఆట ప్రతినిధి: మోటో జీపీ భారత్ కౌంట్డౌన్ ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం హైటెక్ సిటీలో నిర్వహించిన హైదరాబాద్ టూర్ రేసుకు విశేష స్పందన లభించింది. ఈ రేసులో సుమారు 400 మంది రైడర్లు పోటీపడ్డారు. ‘హైదరాబాద్ రేసులో మహిళా రైడర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేసింగ్ కమ్యూనిటీలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది అనేందుకు ఇదే నిదర్శనం’ అని ఫెయిర్ స్ట్రీట్ స్పోర్ట్స్ ఎండీ సుశాంత్ తెలిపారు.