మేడ్చల్ కలెక్టరేట్: దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్లో అమెరికా జట్టుకు తెలంగాణకు చెందిన కొలన్ అనిక వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీకి చెందిన ముప్పు సత్తిరెడ్డి కూతురు మంజుల, అల్లుడు సురేశ్రెడ్డి యూఎస్ఏలో స్థిరపడ్డారు. గత కొన్నేండ్లుగా వారు అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అమెరికా జట్టుకు అనిక ప్రాతినిధ్యం వహించడంపై కుటుంబ సభ్యులతో పాటు నాగారం స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.