హైదరాబాద్: విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.. భారత ప్రజలకు 73వ గణతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం ఆయన తన ట్విట్టర్లో ఈ విషెస్ తెలిపారు. ప్రధాని మోదీ తనకు ప్రత్యేకంగా మెసేజ్ చేశారని, ఆ మెసేజ్తోనే తాను నిద్రలేచినట్లు యునివర్సల్ బాస్ చెప్పాడు. ఇండియాతో తనకు వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ దేశ ప్రజలతోనూ మంచి పరిచయం ఉన్నట్లు గేల్ తెలిపాడు. తన ట్వీట్లో ఇండియా, విండీస్ దేశాలకు చెందిన జాతీయ జెండాల ఎమోజీలను ఆయన పోస్టు చేశారు. 42 ఏళ్ల గేల్ ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో కోల్కతా, పంజాబ్, బెంగుళూరు జట్ల తరపున ఆడాడు. ఇండియాలో క్రిస్ గేల్కు క్రికెట్ అభిమానులు ఎక్కువే.
I would like to congratulate India on their 73rd Republic Day. I woke up to a personal message from Prime Minister Modi @narendramodi reaffirming my close personal ties with him and to the people of India. Congratulations from the Universe Boss and nuff love 🇮🇳🇯🇲❤️🙏🏿
— Chris Gayle (@henrygayle) January 26, 2022