టోక్యో: చైనాకు చెందిన ఇద్దరు సైక్లింగ్ మెడలిస్టులకు .. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం వార్నింగ్ ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics )సైక్లింగ్లో మెడల్స్ గెలిచిన ఇద్దరు అథ్లెట్లు.. ప్రైజ్ సెర్మనీలో సమయంలో .. చైనా మాజీ నేత మావో జిడాంగ్ బ్యాడ్జ్ను ధరించారు. దీని పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ కేసును మూసివేసినట్లు ఇవాళ ఐఓసీ వెల్లడించింది. క్రీడా వేదికలో రాజకీయా సందేశాలు ఇవ్వడం రూల్స్ను ఉల్లంఘించినట్లు అవుతుంది. అథ్లెట్ల నుంచి వివరణ తీసుకున్న ఐఓసీ.. వారిపై నమోదు అయిన కేసును కొట్టివేస్తున్నట్లు చెప్పింది. మళ్లీ ఇలాంటి సంఘటన రిపీట్ కాదన్న హామీ తీసుకున్నారు. ఆదివారం టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ముగియనున్నాయి. ఒలింపిక్ చార్టర్లోని రూల్ 50ని సైక్లిస్టులు బావో షాంజూ, జాంగ్ తియాన్షీలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పొడియంపై అథ్లెట్లు ఎవరూ రాజకీయ సంబంధిత భావాన్ని వ్యక్తపరచకూడదు. కానీ మెడల్స్ గెలిచిన ఆ ఇద్దరు తాము ధరించిన సూట్కు మావో బ్యాడ్జ్లను పెట్టుకున్నారు.