Cheteshwar Pujara : భారత జట్టు నయావాల్ ఛతేశ్వర్ పూజారా క్రీజులోకి వెళ్లాడంటే పాతుకుపోతాడు. అలాంటి అతను తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరో చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో తాను ఎదుర్కొన్నవాళ్లలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ కష్టమైన బౌలర్ అని చెప్పాడు. తాజాగా పూజారా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడాడు.. మునుపటి తరం బౌలర్లలో ఎవరిని ఫేస్ చేయాలని ఉంది? అనే ప్రశ్నకు గ్లెన్ మెక్గ్రాత్ అని చెప్పాడు. అంతేకాదు తనకు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాతో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉందని తెలిపాడు. ‘లారాతో నేను ఏ ఫార్మాట్లోనే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్లో కూడా అతనితో ఆడలేకపోయాను’ అని పూజారా చెప్పుకొచ్చాడు.
మర్చిపోలేని ఇన్నింగ్స్..
టెస్టుల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఇన్నింగ్స్ గురించి అడిగగా.. 2017లో బెంగళూరులో ఆసీస్పై 92 పరుగుల ఇన్నింగ్స్ అని పూజారా బదులిచ్చాడు. అతను 221 బంతుల్లో 92 రన్స్ చేయడంతో భారత్ ఆ మ్యాచ్ గెలిచింది. ఐదు టెస్టుల సిరీస్ను 2-1తో గెలుచుకుది. ఇప్పటివరకూ కమిన్స్ బౌలింగ్లో పూజారా 7 సార్లు ఔటయ్యాడు. దాంతో, త్వరలో జరగనున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో వీళ్ల ఇద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఫిబ్రవరిలో కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ భారత పర్యటనకు రానుంది. ఇరుజట్లు నాలుగు టెస్టు మ్యాచ్ల్లో తలపడనున్నాయి. ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఉన్నందున ఈ సిరీస్ భారత్కు కీలకం కానుంది. పునరాగమనం తర్వాత పూజారా నిలకడగా ఆడుతున్నాడు. బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్లో అతను 222 రన్స్ కొట్టాడు.