ప్రపంచ చెస్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది తన ప్రపంచ ఛాంపియన్ టైటిల్ను డిఫెండ్ చేసుకోబోనని ప్రకటించాడు. 2023 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో తన టైటిల్ను డిఫెండ్ చేసుకోబోనని, మరో మ్యాచ్ ఆడాలనే మోటివేషన్ తనకు లేదని తేటతెల్లం చేశాడు.
ఇలా ఆడటం వల్ల ఎటువంటి లాభమూ ఉంటుందని తనకు అనిపించడం లేదన్నాడు. ఆ టైటిల్ తనకు అంత విలువైంది కూడా కాదని స్పష్టం చేశాడు. అయితే ఈ నిర్ణయం ఆటకు చెడు చేస్తుందని భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశాడు.
‘‘అప్పట్లో బాబీ ఫిషర్ తర్వాత ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. షిషర్ ఆటను వదిలేసి పారిపోయాడు. ఇలా చేయడం వల్ల ఆటకు తీరని నష్టం జరుగుతుంది. ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయినట్లే కదా. అయితే నెమ్మదిగా దీన్ని కూడా ప్రజలు మర్చిపోతారు’’ అని విషీ ఆనంద్ పేర్కొన్నాడు.