ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ వరుసగా ఓడిపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. తన తర్వాత జట్టు పగ్గాలను స్టార్ ఆల్రౌండర రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే అతను కెప్టెన్గా ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం అటుంచింతే.. జడేజా బౌలింగ్లో కూడా పదును తగ్గింది.
బ్యాటింగ్ కూడా అంతంత మాత్రంగా మారిపోయింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కోచ్.. ప్రస్తుతం ఐపీఎల్కు కామెంటేటర్గా ఉన్న రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో జడేజా ఆటగాడినే కొనసాగి ఉండాల్సిందని, అలాగే బెంగళూరు జట్టుకు కెప్టెన్ అయిన డుప్లెసిస్ను రిటైన్ చేసుకొని కెప్టెన్సీ అప్పగించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
ధోనీ తర్వాత జట్టు పగ్గాలను డుప్లెసిస్కు అందించి ఉండాల్సిందని సూచించాడు. ‘‘డుప్లెసిస్ను చెన్నై వదులుకొని ఉండాల్సింది కాదు. అతను మ్యాచ్ విన్నర్. అంతేకాదు, సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్న ప్లేయర్. చెన్నైతో డుప్లెసిస్ కోసం పోటీపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.7 కోట్లకు అతన్ని కొనుగోలు చేసి, జట్టు సారధ్య బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.