చెన్నై : బౌలర్లు నో బాల్స్, వైడ్స్ తగ్గించుకోకపోతే కొత్త కెప్టెన్కింద ఆడాల్సి ఉంటుందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ హెచ్చరికలు పంపాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 12 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ తమ బౌలర్లు మొత్తంగా 3 నోబాల్స్, 13 వైడ్లు వేయడం ధోనీని అసహనానికి గురిచేసింది. చెన్నై ఇన్నింగ్స్లో చివరి ఓవర్లో ధోనీ వరుసగా రెండు సిక్సర్లు బాదడం వారికి కలిసొచ్చింది.
ఆ పరుగులే విజయ వ్యత్యాసం కావడం గమనార్హం. గుజరాత్ టైటాన్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్లోనూ చెన్నై బౌలర్లు 2 నోబాల్స్, 4 వైడ్లు వేశారు. అందులో యువ పేసర్ రాజ్వర్ధన్ హంగార్గేకర్ ఒకే ఓవర్లో ఒక నోబాల్, మూడు వైడ్లు వేయడం గమనార్హం. సోమవారం నాటి మ్యాచ్లో తుషార్ దేశ్పాండే రెండు వికెట్లు పడగొట్టినా 3 నోబాల్స్, 4 వైడ్లు వేశాడు. సీనియర్ బౌలర్ దీపక్ చాహర్ ఒకే వైడ్తో అయిదు పరుగులు ఇచ్చుకోవడం ధోనీకి కోపం తెప్పించింది. దీనితో ధోనీ బౌలర్లకు హెచ్చరికలు జారీచేశాడు.