IPL-2021 | షార్జా వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ సన్రైజర్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో తొలిసారి ఫ్లేఆఫ్కు చేరుకున్న జట్టుగా నిలిచింది. హైదరాబాద్ సన్ రైజర్స్ విధించిన 135 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 45, డుప్లెసిస్ 41 పరుగులతో విరుచుకుపడ్డారు. ప్రారంభంలోనే ఫోర్లు, సిక్సర్లు బాదారు.
కానీ జట్టు స్కోర్ 100 పరుగులు దాటాక మొయిన్ అలీ (17), సురేశ్ రైనా (2), డుప్లెసిస్ వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. వేగం మందగించడంతో గెలుపొందాలంటే రెండు ఓవర్లలో 16 పరుగులు చేయాల్సిన పరిస్థితి. చివరి ఓవర్లో మూడు పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతులకు సన్ రైజర్స్ బౌలర్ సిద్దార్థ్ కౌశల్ ఒకే పరుగు ఇచ్చారు.
ఇక నాలుగో బంతిని సారధి ఎంఎస్ ధోనీ సిక్సర్గా మల్చడంతో చెన్నై సూపర్కింగ్స్ విజయం సాధించింది. అంతకుముందు సన్ రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.