హైదరాబాద్: ఈజిప్టులోని కైరోలో జరిగిన ఫారోస్ జిమ్నాస్ట్ టోర్నీలో తెలుగు అమ్మాయి అరుణా రెడ్డి రెండు స్వర్ణ పతకాలను గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ హైదరాబాదీ జిమ్నాస్ట్కు .. బీసీసీఐ మాజీ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ వీ చాముండేశ్వరనాథ్ కారును బహూకరించారు. కియా సోనెట్ కారును ఆయన ప్రజెంట్ చేశారు. టాలీవుడ్ నటుడు చిరంజీవీతో పాటు కాకినాడ పోర్టు చైర్మెన్ కేవీ రావులు.. జిమ్నాస్ట్ అరుణారెడ్డికి కారు కీని అందజేశారు. ఫారోస్ కప్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ టోర్నీలో 25 ఏళ్ల అరుణ రెండు స్వర్ణ పతకాలను సాధించింది. 2018లో మెల్బోర్న్లో జరిగిన వరల్డ్కప్లో బ్రాంజ్ మెడల్ గెలిచి ఆమె చరిత్ర క్రియేట్ చేసింది. చాముండీ సార్ తనను ఎంతో ఎంకరేజ్ చేసినట్లు అరుణారెడ్డి తెలిపారు. 2018లో ఉజ్బెకిస్తాన్లో రెండు నెలల స్పాన్సర్ శిక్షణ కోసం స్పాన్సర్ చేశారన్నారు. ట్రైనింగ్ స్పాన్సర్ కోసం ఎదురుచూశానని, తనకు చాముండీ సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. ఇప్పుడు కారును ప్రజెంట్ చేయడం, చాలా సంతోషంగా ఉందన్నారు.