నేరేడ్మెట్: ఆల్ఇండియా సబ్ జూనియర్ నేషనల్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ యువ ఆటగాళ్లు చాంపియన్స్గా నిలిచారు. కోల్కతా వేదికగా జరిగిన టోర్నీ బాలికల అండర్-13 డబుల్స్లో పుల్లెల గోపీచంద్ అకాడమీకి చెందిన అవని-లక్ష్మి సాయి ఆరాధ్య జంట 21-17, 21-17తో తేజస్విని-శృతి ద్వయంపై గెలుపొందారు. మ్యాచ్ ఆరంభం నుంచే జోరు కనబర్చిన తెలంగాణ జంట.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్స్లో విజయం సాధించారు. బాలికల సింగిల్స్లో అవని రన్నరప్గా నిలిచింది. మెడల్స్ సాధించిన షట్లర్లను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్తో పాటు రాజేందర్ అభినందించారు.