PBKS vs RR : రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. స్పిన్నర్లు చాహల్, కేశవ్ మహరాజ్లు రెండేసి వికెట్లు తీయడంతో పంజాబ్ ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జితేశ్ శర్మ(11), లివింగ్స్టోన్(1)లు ఆడుతున్నారు. 13 ఓవర్లకు స్కోర్.. 72/5.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు షాక్. నాలుగో ఓవర్లోనే ఆ జట్టు తొలి వికెట్ పడింది. శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన అధర్వ తైడే(15) ఔటయ్యాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్లో తైడే ఇచ్చిన తేలికైన క్యాచ్ను కుల్దీప్ సేన్ అందుకున్నాడు. దాంతో, 27 పరుగుల వద్ద రాజస్థాన్కు తొలి బ్రేక్ లభించింది. ఆ కాసేపటికే చాహల్.. ప్రభ్సిమ్రాన్ సింగ్()ను వెనక్కి పంపాడు. కేశవ్ మహరాజ్ సైతం ఓ చేయి వేయడంతో 12 పరుగుల వ్యవధిలోనే పంజాబ్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సామ్ కరన్(11), శశాంక్ సింగ్(9)లు సైతం విఫలమయ్యారు.