ఇండియన్వెల్స్ : బిఎన్పి పారిబస్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ను కార్లొస్ అల్కారజ్ గెలుచుకున్నాడు. సింగి ల్స్ ఫైనల్లో అల్కారజ్ 6-3, 6-2తో డేనియల్ మెద్వెదెవ్ను మట్టికరిపించాడు. ఈ విజయంతో అల్కారజ్ జొకోవిచ్ను తప్పించి నంబర్వన్ ర్యాంక్ను తిరిగి దక్కించుకున్నాడు. మహిళల ఫైనల్లో ఎలెనా రిబకినా రెండు గంటల పోరులో 7-6(13-11), 6-4తో అరి నా సబలెంకాపై విజయం సాధించింది. విజేతలు ఇరువురికీ 1,262,220 (రూ.10.4 కోట్లు) డాల ర్ల నగదు బహుమతి లభించింది.