India vs Afghanistan Test | భారత్, ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 368/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా(Team India) లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(25 బంతుల్లో 14 నాటౌట్, 2 ఫోర్లు), మానవ్ సుతార్(20 బంతుల్లో 9 నాటౌట్, 2 ఫోర్లు)ఉన్నారు.
తొలి రోజు భారీ ఆధిక్యంతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. కాస్త తడబడింది. తొలి సెషన్లోనే వరుస ఓవర్లలోనే రిషభ్ పంత్(81), ధ్రువ్ జురెల్(19) పెవిలియన్ చేరారు. శనివారమే సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ (177 బంతుల్లో 126, 15ఫోర్లు, 1సిక్స్) పరుగులు చేసి రెండో రోజు ఔటయ్యాడు. సలీమ్ సాఫి 4, రెహమాన్ షరీఫీ 1, హష్మతుల్లా షాహిది 1 వికెట్ పడగొట్టారు.