తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో (ICC Rankings) జస్ప్రీత్ బుమ్రా పైకెళ్లగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కిందికి జారాడు. బౌలింగ్ విభాగంలో ఇద్దరు భారతీయ బౌలర్లకు టాప్-10 చోటుదక్కగా.. బ్యాట్స్మెన్ విభాగంలో ముగ్గురు జాబితాలోకి వచ్చారు. టెస్ట్ బౌలర్ల కోసం ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో అతను 10 స్థానాలు ఎగబాకి 9 వ స్థానానికి చేరుకున్నాడు. మరో భారత బౌలర్ రవిచంద్ర అశ్విన్ తన రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. కాగా, బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ కోహ్లీ ఒక స్థానం కిందికి జారి 5 వ స్థానానికి వచ్చాడు. ఆయన తర్వాత 6 వ స్థానంలో రోహిత్ శర్మ, 7 లో రిషబ్ పంత్ ఉన్నారు.
ఇంగ్లండ్తో ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా టాప్-10 టెస్టు బౌలర్ల జాబితాలోకి తిరిగొచ్చాడు. బుమ్రా తొలి టెస్టులో 110 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు. 2019 సెప్టెంబర్లో బుమ్రా తన కెరీర్లో అత్యుత్త మూడవ స్థానాన్ని పొందాడు. బుమ్రా ఇప్పుడు 760 పాయింట్లతో 9 వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్ 908 పాయింట్లతో ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బౌలర్గా నిలిచాడు. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 856 పాయింట్లతో రెండో స్థానంలో.. న్యూజిలాండ్కు చెందిన టిమ్ సౌథీ మూడో స్థానంలో ఉన్నాడు.
కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి 791 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అదే టెస్టులో సెంచరీ సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 846 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్కు ముందు రూట్ ఐదవ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 901 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (891), మార్న్ లాబుస్చాగ్నే (878) పాయింట్లతో వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. కాగా,
భారత ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టాప్-10 లో కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ 764 పాయింట్లతో 5 వ స్థానంలో, రిషబ్ పంత్ 746 పాయింట్లతో 6 వ స్థానంలో ఉన్నారు. రవీంద్ర జడేజా 3 స్థానాలు ఎగబాకి 36 వ స్థానానికి చేరుకున్నాడు. లోకేశ్ రాహుల్ ర్యాంకింగ్స్లో తిరిగి వచ్చి.. 56 వ స్థానంలో ఉన్నాడు. మొదటి టెస్టులో రాహుల్ 84, 26 పరుగులు చేశాడు.
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
ఇవి ఎకో ఫ్రెండ్లీ బూట్లు.. ఉత్పత్తి ఎక్కడో తెలుసా..?
నష్టాలు పెరుగుతున్నా.. వేగం పుంజుకుంటున్న జోమాటో
ఆఫ్ఘాన్లో దిగజారిన పరిస్థితి : ఇండియా తిరిగొచ్చిన 50 మంది
డయాబెటిస్ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
ఇస్రో మరో మైలురాయి.. ఆకాశంలో మన ‘కన్ను’
చిన్నారిని చంపేసిన ఆన్లైన్ చదువు
చేతిలో భగవద్గీత.. నవ్వుతూ ఉరికంభంపైకి..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..