2007 టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన పోరులో టీమ్ఇండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే బ్రాడ్ బౌలింగ్లో బుమ్రా సుడిగాలిలా విరుచుకుపడ్డాడు.
ఫలితంగా కెరీర్ ఆరంభంలో భారతీయుడి చేతిలో చావుదెబ్బ తినన బ్రాడ్.. ఇప్పుడు చరమాంకంలో మరోసారి ఇండియన్ ప్లేయర్ ధాటికి టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్గా చెత్త రికార్డు తన పేరిట రాసుకున్నాడు.