బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు(ENGvIND)లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్కు భారత జట్టులో మూడు మార్పులు చేశారు. స్పీడ్ బౌలర్ బుమ్రాను తప్పించారు. బుమ్రాతో పాటు శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్ కూడా రెండో టెస్టు నుంచి మిస్సయ్యారు. ఇంగ్లండ్ జట్టు మాత్రం మార్పులు ఏమీ చేయలేదు. తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే ఇంగ్లండ్ బరిలోకి దిగుతున్నది. చివరి రోజు వరకు రసవత్తరంగా సాగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఒకవేళ టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని భారత కెప్టెన్ శుభమన్ గిల్ పేర్కొన్నాడు. భారత జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్లు వచ్చేశారు. బుమ్రా స్థానంలో ఆకాశ్ను తీసుకున్నారు. బుమ్రా వర్క్లోడ్ను తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గిల్ తెలిపాడు. కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కలేదు.
🚨 Toss and Team Update 🚨
England win the toss and elect to bowl in the 2nd Test in Edgbaston.
Three changes for #TeamIndia
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND pic.twitter.com/fGmkOLai7x
— BCCI (@BCCI) July 2, 2025