న్యూఢిల్లీ: భారత వర్ధమాన ప్యాడ్లర్ సుహానా సైనీ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ ట్యునీషియా చాంపియన్షిప్లో కాంస్య పతకం చేజిక్కించుకుంది. హర్యానాకు చెందిన 15 ఏండ్ల సుహానా శుక్రవారం జరిగిన అండర్-19 సెమీఫైనల్లో 11-9, 9-11, 10-12, 11-13తో రొమేనియాకు చెందిన ఎలెనా జహరియా చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ నెగ్గిన సుహానా.. ఆ తర్వాత వరుసగా మూడు గేమ్లు కోల్పోయి కాంస్యంతో సరిపెట్టుకుంది. టోర్నీ ఆరంభం నుంచి చక్కటి విజయాలతో ఆకట్టుకున్న సుహానా.. సెమీస్లోనూ అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నించినా.. ప్రపంచ జూనియర్ నంబర్వన్ జహరియా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.