ENG vs IRE : ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగించింది. తొలిరోజే ఐర్లాండ్ను ఆలౌట్ చేసింది. సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడు ఐదు వికెట్లతో చెలరేగాడు. జాక్ లీచ్ మూడు, మాధ్యూ పాట్స్ రెండు వికెట్లు తీయడంతో ఐర్లాండ్ 172 పరుగులకే పది వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులో జేమ్స్ మెక్కల్లమ్ (36 పరుగులు) టాప్ స్కోరర్.
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఓపెనర్లు జాక్ కార్లే(29 బ్యాటింగ్ ), బెన్ డకెట్(38 బ్యాటింగ్) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు 69 రన్స్ జోడించారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఇంకా 103 పరుగులు వెనకబడి ఉంది. మూడో సెషన్.. 11.3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్..69/0
ఇంగ్లండ్ సొంతగడ్డపై త్వరలోనే ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్కు సన్నద్ధమవుతోంది. జూన్ 16 నుంచి టెస్టు సిరీస్ మొదలు కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్ తర్వాత ప్యాట్ కమిన్స్ బృందం ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ 7 -11 తేదీల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు చాంపియన్షిప్ జరగనుంది. టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. తొలిసారి ఫైనల్ చేరిన ఆసీస్ కూడా విజయంపై కన్నేసింది. స్వదేశంలో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో 4-2తో కంగారులను చిత్తు చేసిన రోహిత్ సేన అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందా? లేదా? అనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.