హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఆరవ జూనియర్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ చాంపియన్షిప్లో ఎస్సీ గురుకులాల బాక్సర్లు అదరగొట్టారు. వివిధ విభాగాల్లో బరిలోకి దిగిన బాక్సర్లు ఆరు పతకాలు కొల్లగొట్టారు. తమ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ప్రత్యర్థి బాక్సర్లను మట్టికరిపించిన గురుకుల బాక్సర్లు సత్తాచాటారు.
నిఖిత(కోకట్), శ్రీలేఖ(గోపాల్పేట్) పసిడి పతకాలు కైవసం చేసుకోగా, మంజుల(నాచర్ల), రాకేశ్(పర్కాల్)కు రజతాలు, సంజన(యెర్రుపాలెం), కార్తీక(మడికొండ)కు కాంస్య పతకాలు దక్కాయి. రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన బాక్సర్లను గురుకుల విద్యాసంస్థల ప్రతినిధులు అభినందించారు.