టోక్యో: టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్లో ( Boxing ) ఇండియాకు మరో జలక్ తగిలింది. 69-75 కిలోల మహిళల బాక్సింగ్ బౌట్లో.. పూజా రాణి ( Pooja Rani ) ఓటమి పాలైంది. క్వార్టర్స్లో చైనా బాక్సర్ లీ క్వియాన్ ( Li Qian )చేతిలో 5-0 తేడాతో మ్యాచ్ను చేజార్చుకున్నది. పూజా రాణి ఓటమి భారత్కు నిరాశనే మిగ్చిలింది. చైనా బాక్సర్ లీ.. మూడు రౌండ్లలోనూ దూకుడు ఆటను ప్రదర్శించింది. భారీ పంచ్లతో పూజాను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో అయిదుగురు జడ్జీలు చైనా బాక్సర్కే మొగ్గు చూపారు. పూజా రాణి చాలా పేలవమైన ఆటను ఆడింది. ఎక్కడా అటాక్ చేసినట్లు కనిపించలేదు. దీంతో ఆమె మెడల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది.