Border – Gavaskar Trophy : మరో మూడు రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ సిరీస్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడు ఎవరో తెలుసా..? టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్. ఆసీస్పై చెలరేగి ఆడే మాస్టర్ బ్లాస్టర్ ఈ టోర్నీలో అత్యధిక సెంచరీలు, అర్థ శతకాలు, పరుగులు చేయడమే కాకుండా ఎక్కువ సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాడు. ప్రతిష్ఠాత్మకమైన ఈ సిరీస్లో సచిన్ నెలకొల్పిన రికార్డులు ఏంటంటే..?
9 సెంచరీలు
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో సచిన్ అత్యధికంగా 9 సెంచరీలు బాదాడు. 16 అర్థ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. అంతేకాదు 6 సార్లు ఈ స్టార్ ఆటగాడు 150కి పైగా పరుగులు చేశాడు. నిప్పలు చెరిగే బ్రెట్లీ, జాన్సన్, మెక్గ్రాత్, గిలెస్పీ వంటి ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ అతను 3,262 పరుగులు సాధించాడు. ఈ సీరీస్లో ఎక్కువ ఫోర్లు, సిక్సర్లు బాదిన ప్లేయర్ కూడా తనే. మాస్టర్ బ్లాస్టర్ ఈ ట్రోఫీలో 391 ఫోర్లు, 25 సిక్స్లు కొట్టాడు. అంతేకాదు ఇరవై సార్లు 180 పరుగులకి పైగా భాగస్వామ్యాలు జోడించాడు. ఐదు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు.
ప్రతీకారంతో ఆసీస్
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు నాగ్పూర్లో ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. దాదాపు 11 ఏళ్లుగా భారత జట్టు స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోలేదు. దాంతో, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఇండియా విజయపరంపరను కొనసాగించాలని భావిస్తోంది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, పూజారా, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్లో ఉన్నారు. సిరాజ్, షమీ, ఉమేశ్ యాదవ్, ఉనాద్కత్తో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే.. స్వదేశంలో టీమిండియా చేతిలో ఓటమి పాలైన ఆసీస్ ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది.
Sachin Tendulkar ruled the Border Gavaskar trophy 😇#CricketTwitter #indvsaus pic.twitter.com/OU3g7uzep0
— Sportskeeda (@Sportskeeda) February 6, 2023