న్యూయార్క్: భారత టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బొప్పన్న(Rohan Bopanna) చరిత్ర సృష్టించాడు. గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత వృద్ధ ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లోకి బొప్పన్న జోడి ప్రవేశించింది. ఆస్ట్రేలియా పార్ట్నర్ మాథ్యూ ఎబ్డిన్తో కలిసి యూఎస్ ఓపెన్ ఆడుతున్న బొప్పన్న .. సెమీస్ మ్యాచ్లో 7-6 (7-3), 6-2 స్కోరుతో ఫ్రెంచ్ జంట పియరీ హ్యూజస్ హెర్బర్ట్, నికోలస్ మాహుట్లను ఓడించారు. గ్రాండ్స్లామ్ మెన్స్ డబుల్ ఫైనల్స్లో ప్రవేశించడం బొప్పన్నకు ఇది రెండోసారి.
యూఎస్ ఓపెన్లో ఆరో సీడ్గా ఈ జోడీ రంగంలోకి దిగింది. ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్షిప్ సెమీఫైనల్లోకి కూడా ఈ జోడి ప్రవేశించింది. ప్రస్తుతం బొప్పన్న వయసు 43 ఏళ్ల ఆరు నెలలు. ఆ ఏజ్లో గ్రాండ్స్లామ్ ఫైనల్లోకి ఎంట్రీ కావడం విశేషం. ఓపెన్ ఎరాలో గ్రాండ్స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించిన ఓల్డెస్ట్ ప్లేయర్గా రికార్డులకెక్కాడు. గతంలో కెనడాకు చెందిన డానియల్ నెస్టర్ అనే ఆటగాడు 43 ఏళ్ల నాలుగు నెలల వయసులో గ్రాండ్స్లామ్ ఫైనల్స్ ఆడాడు.
యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి బొప్పన్న ప్రవేశించడం ఇది రెండోసారి. 2010లో పాక్ భాగస్వామి అసిమ్ ఉల్ హక్ ఖురేషితో కలిసి అతను ఆడాడు.