మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి రజత పతకం కైవసం చేసుకుంది. మణిపూర్కు చెందిన మీరాబాయి చాను పతకం నెగ్గిన మరుసటి రోజే.. అదే రాష్ర్టానికి చెందిన బింద్య కామన్వెల్త్లో రజతంతో సత్తాచాటింది. 23 ఏండ్ల బింద్య 202 కేజీలు (86+116) ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో క్లీన్ అండ్ జర్క్లో క్రీడల రికార్డు బద్దలు కొట్టింది.
అదిజత్ ఒలరినోయ్ 203 కేజీలు (92+111) స్వర్ణం దక్కించుకోగా.. ఫ్రేర్ మారో 198 కేజీలు (92+109) కాంస్యం గెలుచుకుంది. ‘ఇవి నాకు తొలి కామన్వెల్త్ క్రీడలు. రికార్డు బద్దలు కొడుతూ రజతం చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది.
ఆరంభంలో తైక్వాండో ప్రాక్టీస్ చేసేదాన్ని. 2012లో లిఫ్టింగ్ వైపు అడుగులు వేశా. నా ఎత్తు వెయిట్ లిఫ్టింగ్కు ఉపయుక్తకరంగా ఉంటుందని అందరూ అనడంతో ఈ నిర్ణయం తీసుకున్నా’ అని పతకం నెగ్గిన అనంతరం బింద్యారాణి చెప్పింది. ఈ విజయం వెనుక నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన బింద్య.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.