అహ్మదాబాద్ : వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్లో బుధవారం విజయవంతం శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ ఆర్ధోపెడిక్ వైద్యుడు రోవన్ షౌటెన్ నేతృత్వంలో శస్త్రచికిత్స నిర్వహించినట్టు బిసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఈ చికిత్సతో బుమ్రా కనీసం ఆరు నెలలు ఆటకు దూరం కానున్నాడు. అంతా అనుకున్నట్టు జరిగే ఈ యేడాది చివరలో మన దేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్కు బుమ్రా తిరిగి రంగప్రవేశం చేయగలడని ఆశిస్తున్నారు.